పార్టీ ఉంటేనే నాయకులుగా మనలాంటి వారికి గుర్తింపు ఉంటుందని, అధికారం చేతికి వచ్చిందన్న నిర్లక్ష్యం ఎవరిలోనూ ఉండకూడదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.కార్యక్రమం ప్రారంభంలో జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబుతో కలిసి మంత్రి అనిత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, నూతన కమిటీల సభ్యులతో ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల సమష్టి కృషితోనే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. పదవులను అలంకరణగా కాకుండా బాధ్యతగా భావించాలి" అని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa