ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా తల్లి ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 06:17 PM

తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోందని.. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ రమేశ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని వార్త పత్రికల్లో, వాట్సాప్‌ గ్రూపుల్లో తన తల్లి స్వర్గస్తులు అయ్యారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని వాపోయారు. దయచేసి ఎవరూ అలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని విన్నవించారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆమెకు నిరంతరం వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం తరపున అందరూ చేస్తున్న ప్రార్థనలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అనకాపల్లి ఎంపీ రమేష్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa