ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 06:19 PM

కృష్ణా జిల్లాలోని ఘంటశాలలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు  ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు అని తెలిపారు. రాష్ట్రంలో నూటికి 64 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారన్నారు. గత పాలకులు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. పంట చేతికొచ్చాక ప్రతి సంవత్సరం తుఫానులు రావడంతో రైతులు నష్టానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని ధృడ సంకల్పంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని... ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు రైతన్నా మీకోసం కార్యక్రమం పెట్టి రైతులను రోడ్డున పడేశారని ఒక వ్యక్తి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కూడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa