వైసీపీ అధినేత జగన్ కు కుట్రలు, కుతంత్రాలతో పాటు ఈర్ష్య, అసూయ కూడా పెరిగిపోతున్నాయని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు సంతోషంగా ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం రైతుల సాధికారత కోసం 'పంచసూత్రాలు' అమలు చేస్తుంటే, వారి మంచిని చూడలేక జగన్ ఏడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవని, వారిని ఆత్మహత్యల వైపు నెట్టారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలే ఆయన పాలనకు నిదర్శనమని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని అనగాని భరోసా ఇచ్చారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో పోటీ పడే స్థాయికి ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. రైతుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతుంటే, జగన్ ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa