ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత్

sports |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 09:15 PM

భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో చైనీస్ తైపీ జట్టుపై భారత్ 35–28 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని కబడ్డీ క్రీడలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.ఈ టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగించింది. తమ గ్రూప్ మ్యాచ్‌లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఇరాన్‌పై 33–21 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు, చైనీస్ తైపీ కూడా తమ గ్రూపులో అజేయంగా నిలిచి, సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa