ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వం ఏ పంటలకూ గిట్టుబాటు ధర కల్పించలేకపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 12:12 PM

పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ...  ప్రత్తి, అరటి, మొక్కజోన్న, మినుమలు, శెనగలు, మొక్కజొన్న, మిర్చితో పాటు ఏ పంటలకూ గిట్టుబాటు ధరలేక రైతులు రొడ్డెక్కే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. దీనికి తోడు పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ లేకపోవడంతో సాగు భారమై అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే,  చంద్రబాబు మాత్రం  రోమ్ నగరం తగలబడుతుంటే... ఫిడేల్ వాయించిన నీరో  చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa