ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ వర్గాలను రాజకీయాలకి దూరం చేయ్యాలనే కక్షతోనే బీసీలపై దాడులు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 12:17 PM

కూట‌మి ప్ర‌భుత్వంలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ రమేష్ గౌడ్ మండిప‌డ్డారు. హిందూపురం పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో అక్రమ కేసులు, రాజకీయ వేధింపులపై  వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ టిఎన్ దీపికతో క‌లిసి ర‌మేష్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పోలీసులు ఏకపాక్షికంగా వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ముఖ్యంగా బీసీ వర్గాలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు, కేసులు బీసీ వర్గాలను రాజకీయాల నుంచి దూరం చేయాలనే ప్రయత్నంగా పరిగణిస్తున్నామని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.“బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా? వ్యాపారాలు చేయకూడదా?” అని ప్రశ్నించారు. హిందూపురంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ నిర్వహిస్తున్న మద్యం దుకాణంపై కక్ష సాధింపుగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆయనను దూషించినట్లు చూపుతూ అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గ‌మైన‌ చర్య అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa