ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలోని ఆలయ శిఖరంపై నేడు ఎగరనున్న కాషాయ పతాకం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 02:17 PM

అయోధ్యలోని రామ మందిరంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు, సాధువులు హాజరయ్యారు. ఆలయ నిర్మాణం సంపూర్ణమైనందుకు గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తోటాద్రి మఠ జగద్గురు స్వామి అనంతాచార్య మాట్లాడుతూ, ఆలయానికి జెండా ఒక ముఖ్యమైన సంకేతమని అన్నారు. "జెండాను చూడగానే అది ఒక మతపరమైన ప్రాంతమని దూరం నుంచే తెలుస్తుంది. మంచి పనులు పూర్తయిన శుభ గడియల్లో జెండాను ఆవిష్కరిస్తారు. దేశ ప్రజల సంక్షేమ లక్ష్యంతోనే ఈ ధ్వజారోహణం జరుగుతోంది" అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa