ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్‌ 1న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 02:34 PM

డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి, వారి సహకారం కోరనుంది.డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 15 సిట్టింగ్‌లు ఉంటాయి. అయితే, ఈసారి సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సభలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అంశాలపై చర్చించేందుకు విపక్షాలు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa