తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, మాధవరాయిడు పాలెం గ్రామాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. చల్లా వెంకట నరసింహారావు, శాస్త్రవేత్త డా. మానుకొండ శ్రీనివాస్ రైతులకు నీటి వినియోగం, వర్తక అవసరాల ఆధారంగా పంటల ఎంపిక, తాజా సాంకేతికతల ప్రాధాన్యతను వివరించారు. కొత్తగా అభివృద్ధి చేసిన వరి, మొక్కజొన్న, పప్పుధాన్య రకాల ప్రయోజనాలు తెలియజేశారు. అనంతరం ఎంటియు–1426 రకానికి చెందిన రబీ వరి విత్తనాలను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రైతులకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa