ఫ్యామిలీ పెన్షన్ నియమాలపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి మరణించిన తర్వాత కుమార్తె విడాకులు తీసుకున్నట్లయితే.. ఆమె తన తల్లి వైపు ఫ్యామిలీ పెన్షన్ను పొందేందుకు అర్హురాలు కాదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు మంగళవారం ఉదయం వెబ్సైట్లో అప్లోడ్ అయింది.
విడాకుల సమయమే ముఖ్యం..
తండ్రి మరణించే సమయానికి కుమార్తె వివాహం జరిగి, ఆమె భర్తపై ఆధారపడి ఉంటే.. ఆ తర్వాత ఆమె విడాకులు తీసుకుని తిరిగి తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పటికీ పెన్షన్ పొందేందుకు అర్హురాలు కాదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. అంటే తండ్రి జీవించి ఉన్నంత వరకు కుమార్తె అతనిపై ఆధారపడినట్ల అయితే మాత్రమే ఆమెకు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వివరించింది. అంతేకాకుండా విడాకులు తీసుకున్న మహిళలకు పెన్షన్ మంజూరు చేయాలని గతంలో ఇచ్చిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్కు పెన్షన్ ఇవ్వకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
పిటిషనర్ తండ్రి కేంద్ర ప్రభుత్వ సేవలో పని చేసేవారు. అయితే ఆయన1996లో పదవీ విరమణ చేశారు. 2003లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయానికి అతడి కుమార్తె వివాహం చేసుకుని భర్తపై ఆధారపడి ఉంది. అయితే 2016లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. ఆమె తన తండ్రి పెన్షన్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును అంగీకరించిన CAT.. ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
దీనిని సవాలు చేస్తూ కేంద్రం తరఫు న్యాయవాది ఫటిక్ చంద్ర దాస్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే మంగళవారం రోజు విచారణ జరిగింది. ఈసందర్భంగానే న్యాయవాది దాస్ వాదిస్తూ.. తండ్రి మరణించే సమయానికి కుమార్తెకు వివాహం అయిందని, ఆమె తండ్రి పెన్షన్పై ఆధారపడి లేదని పేర్కొన్నారు. కేవలం కుటుంబంలోని ఆధారపడిన సభ్యులు మాత్రమే పెన్షన్కు అర్హులని.. ఇప్పుడు ఆమె తన సొంత అవసరాల కోసం పెన్షన్ అడగడం సముచితం కాదని వాదించారు. మరోవైపు కుమార్తె తరఫు న్యాయవాది చంద్రేయీ ఆలం తన క్లయింట్ ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉన్నార.., కుమార్తెగా ఆమెకు తండ్రి ఫ్యామిలీ పెన్షన్ పొందే హక్కు ఉందని వాదించారు. కానీ న్యాయస్థానం మాత్రం ఆమెకు పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa