ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 06:37 AM

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లను సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. బలభద్రాపురం, పొలమూరు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను  ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, గతేడాది కంటే క్వింటాలుకు రూ.72 అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa