రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నివాళులర్పించారు. ‘‘76 ఏళ్ల క్రితం డాక్టర్ అంబేద్కర్ మనకు స్వేచ్ఛ, సమానతల కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆయనకు ఇవ్వగలిగే ఉత్తమ నివాళి ఆ విలువలను కాపాడుకోవడమే. మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా పులివెందుల నివాసంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa