ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాలిబన్లతో సంబంధాలు ఇప్పుడల్లా పెరిగేలా లేవు

international |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 04:57 PM

పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. తాలిబన్లపై తమకు ఇక ఎలాంటి ఆశలు లేవని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా  ఆయన ఈ మాట్లాడుతూ... 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆసిఫ్ అంగీకరించారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై ఇటీవల జరిగిన శాంతి చర్చలు కూడా ఎలాంటి ఫలితం ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ తమ భూభాగంపై బాంబు దాడులు చేసిందంటూ అఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీవుల్లా చేసిన ఆరోపణలను ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa