ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీకే శివకుమార్‌ను త్వరలోనే సీఎం అవుతారు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 05:00 PM

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సీఎం చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి.డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ "శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారనే నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇది 200 శాతం ఖాయం" అని ధీమా వ్యక్తం చేశారు. "అధికార మార్పిడి అనేది ఐదారుగురు అగ్రనాయకుల మధ్య జరిగిన రహస్య ఒప్పందం. ఆ నేతలే దీనిపై నిర్ణయం తీసుకుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు. డీకే వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అయితే, ఈ లాబీయింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. "నేను ఏ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదు, వారికి ఫోన్ చేయలేదు. వాళ్లు ఎందుకు ఢిల్లీ వెళ్లారో నేను అడగను. బహుశా మంత్రి పదవుల కోసం వెళ్లి ఉండవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa