ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సతీశ్ జార్కిహోళితో సమావేశమైన డీకే శివకుమార్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 05:04 PM

కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న వేళ, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళితో మంగళవారం అర్ధరాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సీఎం సిద్ధరామయ్య రాజకీయ వారసుడిగా, 'అహింద' (మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు) ఓటు బ్యాంకుకు బలమైన నేతగా భావిస్తున్న జార్కిహోళితో డీకేఎస్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్య తర్వాత పార్టీని నడిపించే వ్యూహాలపై, తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా, తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని జార్కిహోళి ముందుకు తీసుకెళ్లగలరని వ్యాఖ్యానించారు.ఒకవైపు ఈ సమావేశం జరగ్గా, మరోవైపు డీకే శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలో లాబీయింగ్ ముమ్మరం చేశారు. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, డీకేఎస్‌ను త్వరలో ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. డీకేఎస్ 200 శాతం సీఎం అవుతారని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa