హిందూ సంప్రదాయంలో శంఖం ఎంతో పవిత్రమైనది. దీన్ని ధ్వనిస్తే సానుకూల శక్తులు వ్యాపిస్తాయని, ప్రతికూల శక్తులు దూరమవుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. శంఖ ధ్వని ఓంకార నాదంతో సమానమని శాస్త్రాలు చెప్పడం వెనుక ఈ విశ్వాసమే కారణం. అందుకే పూజలు, ఆరతులు, శుభకార్యాలలో శంఖనాదం తప్పనిసరి అయింది.
అయితే అన్ని శంఖాలూ ఒకేలా ఉండవు. మరీ ముఖ్యంగా ఒక శంఖంలోనే మరో నాలుగు చిన్న శంఖాలు సహజంగా ఏర్పడితే దాన్ని “పాంచజన్య శంఖం” అంటారు. ఇది అత్యంత రేర్, దాదాపు లభించనంత అరుదైనది. భగవాన్ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధరించి, యుద్ధాల్లో ఊదిన ఆ ప్రసిద్ధ పాంచజన్యం కూడా ఇదే రకమైనదని పురాణాలు చెబుతున్నాయి.
ఇలాంటి అపూర్వమైన పాంచజన్య శంఖం ఒకటి ఇప్పుడు మైసూరు చాముండి కొండపై ఉన్న శ్రీ చాముండేశ్వరీ దేవి ఆలయంలో భద్రంగా ఉంది. దేవాలయ అర్చకులు, పండితుల ప్రకారం ఈ శంఖం సహజంగానే ఐదు శంఖాలతో ఏర్పడిన అద్భుతం. దీన్ని దర్శించుకోవడం అంత సులువైన విషయం కాదు – ప్రత్యేక అనుమతి, నిర్దిష్ట రోజుల్లోనే భక్తులకు చూపిస్తారు.
ఈ అద్భుత శంఖాన్ని కన్నులారా చూస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని, దుష్టశక్తులు పారిపోతాయని, మనసుకు అపూర్వమైన శాంతి కలుగుతుందని లక్షలాది భక్తుల గట్టి నమ్మకం. అందుకే చాముండేశ్వరిని దర్శించుకునే ప్రతి భక్తుడూ ఈ పాంచజన్య శంఖ దర్శనం కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa