ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 16వరకు జోగి రమేశ్‌ కి రిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 02:27 PM

నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రామును పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయమూర్తి, జోగి సోదరులిద్దరికీ ఈనెల 16వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.ఇటీవల ఈ కేసులో జోగి రమేశ్‌ను ఏ-32గా, ఆయన సోదరుడు రామును ఏ-33గా చేర్చిన ఎక్సైజ్ పోలీసులు, తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న జోగి సోదరులను, పీటీ వారెంట్‌పై భారీ భద్రత మధ్య తంబళ్లపల్లె కోర్టులో హాజరుపర్చారు.విచారణ అనంతరం న్యాయాధికారి ఉమర్‌ ఫరూక్‌ రిమాండ్ విధించడంతో, వారిని తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa