ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమికి ఒకేవ్యక్తి కారణం అవ్వడు

sports |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:44 PM

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి కేవలం ఒక వ్యక్తిని నిందించడం సరికాదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ....."ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యతే అని ప్రజలు గుర్తించాలి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సమంజసం కాదు. నా విషయంలోనూ ఇలాగే జరిగింది, ఆ అనుభవంతోనే చెబుతున్నా. ఓటమికి ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలి, తమ వైఫల్యాన్ని అంగీకరించాలి" అని రవిశాస్త్రి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టుగా ఆడి భారత్‌ను ఓడించిందని, కానీ మనం జట్టుగా ఆడామా? అని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa