క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం ఆటతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటనను పంచుకున్నాడు. తన మాజీ సహచరుడు గురుశరణ్ సింగ్కు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో వివరించారు.మంగళవారం ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. "ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు నేను 85 పరుగుల వద్ద ఉన్నాను. అప్పటికే 9 వికెట్లు పడిపోయాయి. జట్టు వైస్ కెప్టెన్ అయిన గురుశరణ్ సింగ్ చేయి విరగడంతో బ్యాటింగ్ చేసే స్థితిలో లేడు. కానీ, క్రికెట్ దిగ్గజం రాజ్ సింగ్ దుంగార్పూర్ చెప్పడంతో అతను విరిగిన చేత్తోనే బ్యాటింగ్కు వచ్చాడు. అతని మద్దతుతో నేను సెంచరీ పూర్తి చేశాను. ఆ సెంచరీ వల్లే నేను భారత జట్టుకు ఎంపికయ్యాను" అని సచిన్ వెల్లడించాడు.ఆ రోజు గురుశరణ్ చూపిన చొరవ, అతని వైఖరి తన హృదయాన్ని తాకిందని సచిన్ చెప్పాడు. "అతని సాయానికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలిపాను. అప్పుడే న్యూజిలాండ్లో అతనికి ఒక మాట ఇచ్చాను. 'గుషీ, ఎప్పటికైనా నువ్వు రిటైర్ అయ్యాక నీ బెనిఫిట్ మ్యాచ్ జరిగితే, నేను తప్పకుండా వచ్చి ఆడతాను' అని హామీ ఇచ్చాను" అని గుర్తుచేసుకున్నాడు.దాదాపు 15 ఏళ్ల తర్వాత గురుశరణ్ తన బెనిఫిట్ మ్యాచ్ కోసం ఫోన్ చేయగా, సచిన్ తన మాటను నిలబెట్టుకున్నాడు. "నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఆడతావా అని అడిగాడు. నేను వెంటనే, 'తప్పకుండా వస్తాను, అది నా బాధ్యత' అని చెప్పి ఆ మ్యాచ్ ఆడాను. ఈ జ్ఞాపకాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. నేను ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు ఈ రోజు గర్వంగా చెప్పగలను" అని సచిన్ చిరునవ్వుతో వివరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa