ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 14, 2025, 04:19 PM

ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టును తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా కేంద్ర జల సంఘం సహా ఇతర సంస్థలను నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు.పాత పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకే పేరు మార్చి, డీపీఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. ఈ అంశంపై రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa