మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలి. లేదంటే కడుపు ఉబ్బరంగా ఉంటూ అనేక అవస్థలు తెచ్చి పెడుతుంది. ఏం తిన్నా అరగని వారికే ఈ బాధ తెలుస్తుంటుంది. అయితే దీన్ని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మాత్రలు వేసుకోవడం, ఇనో తాగడం, నిమ్మకాయ రసం, సోంఫు తినడం వంటివి చేస్తుంటారు. అయినా తగ్గకపోతే నరకం చూస్తూనే వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఇలాంటివేమీ లేకుండా.. రోజూ ఈ పది రకాల ఆహార పదార్థాలు తింటే మీరు ఏం తిన్నా ఇట్టే అరిగిపోతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (గట్ డాక్టర్) సౌరభ్ సేథీ తాజాగా వెల్లడించారు.
ముఖ్యంగా ఈ పది రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సహజంగా జీర్ణక్రియ మెరుగవడానికి ఉపయోగపడే సహజ ఎంజైమ్లో లభిస్తాయన్నారు. ఫలితంగా ఏం తిన్నా అరగకుండా ఉండే సమస్య దూరమైపోతుందని చెప్పారు. అంతేకాదండోయ్.. ఆ పది ఆహార పదార్థాలకు ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. అవేంటో వాటి స్కోరు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అవకాడో తినండి
అవకాడోలో కొవ్వు జీర్ణం కావడానికి ఉపయోగపడే సహజ ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. డాక్టర్ సేథీ దీనికి 100కు గాను 91 స్కోరు ఇచ్చారు.
కివీ మంచిది
కివీలో ఉండే ప్రోటీన్స్ జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సాయపడతాయి. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 90 మార్కులు ఇచ్చారు.
అల్లం చేసే మేలు
అల్లం అజీర్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 89 స్కోర్ ఇచ్చారు.
బొప్పాయి తినండి
బొప్పాయి పండులో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే దీన్ని తీసుకుంటే ఏదైనా త్వరగా అరుగుతుంది. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 88 స్కోరు ఇచ్చారు.
అరటిపండు మంచిది
అరటి పండులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 83 మార్కులు ఇచ్చారు.
మామిడి పండు తినండి
మామిడి పండు జీర్ణ ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఫలితంగా ఆహారం త్వరగా అరుగుతుంది. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 82 స్కోరు ఇచ్చారు.
సావర్క్రాట్ తినండి
సావర్క్రాట్ అనేది ఫర్మెంటెడ్ ఫుడ్, గట్ బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. ఫలితంగా ఆహారాన్ని అరిగించే ఎంజైమ్లు శరీరంలోకి చేరుతాయి. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 80 మార్కులు ఇచ్చారు.
అనాస పండు శక్తివంతమైంది
పైనాపిల్లో 'బ్రోమెలైన్' అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. దీని వల్లే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి వైద్యుడు సేథీ 100కు గాను 78 స్కోరు ఇచ్చారు.
మిసో చాలా మంచిది
మిసోలో ప్రోబయోటిక్ ప్రయోజనాలను కలిగి ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్. దీని వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనికి డాక్టర్ సేథీ 100కు గాను 73 మార్కులు ఇచ్చారు.
తేనె తీసుకోండి
తేనెలో చిన్న మొత్తంలో ఎంజైమ్లను కలిగి ఉంటుంది. దీనివల్ల కూడా ఆహారం త్వరగా అరుగుతుంది. డాక్టర్ సేథీ దీనికి 100కు గాను 70 స్కోరు ఇచ్చారు.
అలాంటి సందర్భాలలో పైన పేర్కొన్న ఆహార పదార్థాలను (ముఖ్యంగా అవకాడో, కివీ, బొప్పాయి, అల్లం వంటి అధిక స్కోరు సాధించినవి) తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు సహజంగా మద్దతు ఇవ్వవచ్చు. ఈ ఆహారాలు ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ (సావర్క్రాట్, మిసో) తీసుకోవడం వలన పొట్టలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుందని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa