కొత్తగా ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడంతో వీటి ధరలు పెరగనున్నాయి. తయారీకి వాడే కాపర్ ధరలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఏసీల ధరలు 5-7%, ఫ్రిడ్జ్ల ధరలు 3-5% పెరిగే అవకాశం ఉంది. బీఈఈ స్టార్ రేటింగ్స్ లో మార్పులు, నాణ్యమైన పరికరాల వాడకం తప్పనిసరి చేయడంతో పాటు, ఎల్పీజీ గ్యాస్ స్టవ్స్, కూలింగ్ టవర్లు, చిల్లర్లకు కూడా స్టార్ రేటింగ్ తప్పనిసరి చేయడంతో ధరలు పెరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa