పిల్లల నుంచి పెద్దల వరకు అరటిపండ్లు ఇష్టంగా తింటారు. రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగానూ ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొందరు వ్యాపారులు ఎక్కువ లాభాల కోసం రసాయనాలతో పండించిన అరటిపండ్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే మార్కెట్లో అరటిపండ్లు కొనుగోలు చేసే సమయంలో అవి సహజంగా పండాయా లేదా రసాయనాలతో పండించాయా అనే విషయాన్ని ఈ చిన్న ట్రిక్లతో గుర్తించవచ్చు.
*కాండం రంగు : రసాయనాలతో పండించిన అరటిపండ్ల కాండం సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే పండు మాత్రం పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తుంది. సహజంగా పండిన అరటిపండ్లలో మాత్రం కాండం, పండు రెండూ క్రమంగా పసుపు లేదా కొద్దిగా నల్ల రంగులోకి మారుతాయి.
*తొక్క రంగు :రసాయనికంగా పండించిన అరటిపండ్లు నిమ్మకాయలా ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీనికి భిన్నంగా సహజంగా పండిన అరటిపండ్లు లేత పసుపు రంగుతో సహజమైన మెరుపు మాత్రమే కలిగి ఉంటాయి.
*నల్ల మచ్చలు :అరటిపండ్లు సహజంగా పండినప్పుడు వాటి తొక్కపై చిన్నచిన్న నల్ల మచ్చలు కనిపించడం సాధారణం. రసాయనాలతో పండించిన అరటిపండ్లలో ఈ మచ్చలు ఉండవు. అవి పూర్తిగా శుభ్రంగా, ఒకే రకమైన పసుపు రంగులో కనిపిస్తాయి.
*అరటిపండు రుచి:రసాయనికంగా పండించిన అరటిపండ్లలో తీపి తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిగా చేదు లేదా ఆస్ట్రిజెంట్ రుచి కూడా అనిపించవచ్చు. సహజంగా పండిన అరటిపండ్లు మాత్రం బాగా తీపిగా, జ్యూసీగా ఉంటాయి.
*నీటి పరీక్ష: ఒక బకెట్ నీటిలో అరటిపండ్లను వేసి చూడండి. అవి నీటిపై తేలుతూ ఉంటే సహజంగా పండినవిగా భావించవచ్చు. అదే అరటిపండ్లు నీటి అడుగున మునిగిపోతే, అవి రసాయనాలతో పండించినవై ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రసాయనాల వాడకం వల్ల పండ్ల బరువు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa