మీ ఇంట్లో ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ (RBI) పదే పదే స్పష్టం చేసినట్టు, వీటిని చట్టబద్ధంగా వాడవచ్చు. ఆర్బీఐ 2023 మేలో సర్క్యులేషన్ నుండి ఈ నోట్లను ఉపసంహరించడం ప్రారంభించింది, దీని ప్రధాన కారణం దేశంలో రోజువారీ లావాదేవీలలో ఎక్కువగా ఉపయోగం కానడం. అయితే ఇది నోట్ల రద్దు కాదు.అందులోని 98% కంటే ఎక్కువ నోట్లు RBIకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం మాత్రమే ₹5,669 కోట్లు విలువ ఉన్న నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోట్లు 2026 వరకు చట్టబద్ధంగా ఉంటాయి, కానీ వాటి వాడకం గణనీయంగా తగ్గింది. RBI ఇప్పటికే చాలా నోట్లు సర్క్యులేషన్ నుండి ఉపసంహరించుకుంది.దేశంలో తగినంత ఇతర డినామినేషన్ల నోట్లు ఉన్నందున, RBI “క్లీన్ నోట్ పాలసీ” కింద 2000 రూపాయల నోట్లను మే 2023లో చెలామణి నుండి ఉపసంహరించింది. ఏ సాధారణ బ్యాంక్ శాఖలోనైనా వాటిని మార్చుకునే అవకాశం 7 అక్టోబర్ 2023న ముగిసింది. అంటే, మీరు సాధారణంగా బ్యాంక్లో వెళ్లి రూ.2,000 నోట్లను ఇతర కరెన్సీతో మార్చుకోలేరు.అయితే, మరో ఆప్షన్ ఉంది. RBI 19 ప్రాంతాల్లో ఇష్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసింది, అక్కడ నోట్లను మార్చుకోవచ్చు. ఇవి: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, బేలాపూర్.ఇవన్నిటికి వెళ్లలేకపోతే, ఇండియా పోస్ట్ సర్వీస్ ద్వారా కూడా RBIకి నోట్లను పంపి, బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు, సీనియర్ సిటిజన్లు లేదా వ్యక్తిగత సమస్యలు ఉన్నవారికి ఉపయోగపడుతుంది.నోట్లను మార్చేటప్పుడు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు అవసరం. 2000 రూపాయల నోట్లు చట్టబద్ధంగా వున్నప్పటికీ, ఎల్లప్పుడూ వాడకంలో ఉండవు; వీటిని కేవలం మార్పిడి కోసం మాత్రమే ఉపయోగించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa