తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) కీలక అలర్ట్ జారీ చేసింది. ఘాట్ రోడ్డు ప్రయాణానికి సంబంధించి నిబంధనలు, సమయాల గురించి మరోసారి స్పష్టం చేసింది. భక్తుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని మరోసారి వీటి గురించి భక్తులను అలర్ట్ చేసింది.
తిరుమల ఘాట్ రోడ్డులో భక్తుల భద్రత, వన్యప్రాణుల రక్షణ కోసం ప్రయాణ సమయాలు, నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది. ప్రమాదాలను నివారించేందుకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాలు ఉదయం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తారు.
అదే ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. రాత్రి వేళల్లో అడవుల్లో జంతువుల సంచారం ఎక్కువగా ఉండటంతో బైక్లకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఘాట్ రోడ్డులో వేగాన్ని నియంత్రించడానికి టీటీడీ 'టైమ్ లాక్' విధానాన్ని అమలు చేస్తోంది. టోల్ గేట్ వద్ద వాహనం ఎప్పుడు ప్రవేశించిందో నమోదు చేస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి కనీసం 28 నిమిషాలు, తిరుమల నుంచి తిరుపతికి రావడానికి కనీసం 40 నిమిషాలు పడుతుంది అని చెప్పింది.
టీటీడీ విధించిన సమయం కంటే ముందే గమ్యస్థానానికి చేరుకుంటే టోల్ గేట్ వద్ద జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. కాబట్టి, భక్తులు వేగాన్ని తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఘాట్ రోడ్డులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించాలని టీటీడీ సూచించింది. ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు జరగకుండా, భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు భక్తుల భద్రతతో పాటు అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా అమలులో ఉన్నాయి. తాజాగా వీటి గురించి మరోసారి భక్తులను అలర్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa