ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నింగికెగిరిన పీఎస్ఎల్వీ– సీ62 రాకెట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 01:26 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నింగికెగిరిన పీఎస్ఎల్వీ– సీ62 రాకెట్ తొలి రెండు దశల్లో సాఫీగా ప్రయాణించింది. అయితే, మూడో దశలో రాకెట్ ప్రయాణానికి అంతరాయం ఏర్పడిందని ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ వెల్లడించారు. సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు.దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్‌-ఎన్‌1’ లేదా ‘అన్వేష’ ఉపగ్రహంతో పాటు భారత్, యూకే, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్‌ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. అయితే, వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa