ఏపీలో వైద్య రంగాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్స్ (ఏఐజీ)కు విశాఖలో భూమి కేచాయించడానికి.. బుధవారం (జనవరి 28) సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎండాడ ప్రాంతంలో 9.04 ఎకరాలను ఏఐజీ హాస్పిటల్స్ సంస్థకు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఈ భూమి కేటాయింపు ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు లోబడి ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇదే కాకుండా మరికొన్ని సంస్థలకు కూడా భూకేటాయింపులు చేసింది కేబినెట్.
ఎకరం రూ. 5 కోట్లు?
కాగా, ఏఐజీ హాస్పిటల్స్ సంస్థ మొత్తం 15 ఎకరాలను కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది కానీ ఏపీ ప్రభుత్వం.. వివాదాలు లేని 9.04 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆనుమతి ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ సంస్థ స్థలాన్ని తక్కువ ధరకు భూములు ఇవ్వాలని కోరినా.. మార్కెట్ రేటు ప్రకారమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కో ఎకరాన్ని రూ. 5 కోట్ల చొప్పును ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
కాగా, అత్యాధునిక 800 పడకలు గల ఏఐజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. భారత్లోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటి. ఏఐజీ హాస్పిటల్స్లో 8 కీలక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. ఇవి సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నాయి. మెడికల్ & సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్ సైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, పల్మనరీ సైన్సెస్, రీనల్ సైన్సెస్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్, ఒబేసిటీ & మెటబాలిక్ థెరపీ వంటి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ల్లో నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి.
దేశంలో తొలిసారి..
కాగా, తీవ్రమైన జీర్ణకోశ సమస్యలకు కారణమయ్యే హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్.పైలోరీ) ఇన్ఫెక్షన్ను గుర్తించే శ్వాస పరీక్ష గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లో తొలిసారి అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సౌకర్యం మొదటిది కావడం గమనార్హం. పీవై టెస్టుగా వ్యవహరించే ఈ పరీక్ష కేంద్రాన్ని బుధవారం (జనవరి 28) ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. నోబెల్ బహుమతి గ్రహీత, హెచ్ పైలోరీ బ్యాక్టీరియాను కనుగొన్నారు. ప్రొఫెసర్ బారీ మార్షల్ ఈ పీవై టెస్టును అభివృద్ధి చేశారు. ట్రైమెడ్ సంస్థ ఈ కిట్ను తయారు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa