మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి.. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో పైలట్ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.
తప్పుడు ల్యాండింగ్ నిర్ణయం
విమాన ప్రమాదం జరిగిన సమయంలో బారామతిలో పొగమంచు వల్ల విజిబిలిటీ చాలా తక్కువగా ఉందని.. విమానాన్ని పూణేకు మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ.. పైలట్ బారామతిలోనే ల్యాండ్ చేయడానికి మొగ్గు చూపారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
చివరి నిమిషంలో కరెక్షన్
మొదటి ప్రయత్నంలో రన్వే కనిపించక గో అరౌండ్ చేసిన పైలట్లు.. రెండోసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే విమానం వేగం.. పొజిషన్ సరిగ్గా లేకపోవడంతో చివరి నిమిషంలో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. దాని వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు.
బ్లాక్ బాక్స్ డేటా
ఇక ఘటనా స్థలం స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్ ప్రకారం.. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్లు ఓ షిట్ అని అరిచినట్లు అందులో రికార్డ్ అయింది. అంటే ప్రమాదాన్ని ముందే ఊహించినప్పటికీ.. దాన్ని నివారించలేకపోయారని అర్థం అవుతోంది. ఈ విమానంలో ఆధునిక నావిగేషన్ వ్యవస్థ అయిన గగన్ లేకపోవడం కూడా పైలట్లు రన్వేను గుర్తించడంలో ఇబ్బంది పడటానికి ఒక కారణమని తెలుస్తోంది.
మరోవైపు.. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్లో వేలమంది అభిమానులు, కార్యకర్తల మధ్య అజిత్ పవార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కుమారులు పార్థ్, జయ్ పవార్ చితికి నిప్పు అంటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, శరద్ పవార్, సుప్రియ సూలే, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరై నివాళులు అర్పించారు. అజిత్ పవార్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa