ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం మ్యాచ్ అఫీషియల్స్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 24 మంది ఆన్-ఫీల్డ్ అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. సూపర్-8, నాకౌట్ దశలకు సంబంధించిన అఫీషియల్స్ వివరాలను ఐసీసీ తర్వాత వెల్లడించనుంది.కొలంబోలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్కు కుమార ధర్మసేన, వేన్ నైట్స్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్తో నైట్స్ టీ20 ప్రపంచకప్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇదే మ్యాచ్లో నైట్స్ తన 50వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్కు అంపైర్గా నిలవడం విశేషం. ధర్మసేన గతంలో 2016, 2022 ఫైనల్స్తో సహా అనేక కీలక మ్యాచ్లకు అంపైరింగ్ చేశాడు.అందరూ ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ పోరుకు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, కుమార్ ధర్మసేన అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఇక ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో జరిగే మ్యాచ్కు పాల్ రీఫిల్, రాడ్ టక్కర్ అంపైర్లుగా ఉంటారు. భారత్కు చెందిన నితిన్ మీనన్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకోగా, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా ఎంపికయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa