హోలీ పండుగను రంగులతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఈ వేడుకలో వాడే రసాయన రంగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండుగ సందర్భంగా ఉపయోగించే రంగులలో పారిశ్రామిక రంగులు, లెడ్ ఆక్సైడ్, రాగి వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు కళ్లపై ప్రభావం చూపి శాశ్వత నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. రసాయనాలు కలిసిన రంగులు కళ్లకు తగిలినప్పుడు కెమికల్ రీ యాక్షన్ జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa