విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలసి మెలసి చదువుకుంటూ.. తిరుగుతున్న స్నేహితులే తనను అనుమానించారని వేదనకు గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని పూల్బాగ్ కాలనీలో చోటు చేసుకొంది. ఈనాడు కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన కె. దుర్గాప్రసాద్ అలియాస్ బన్ని(18) పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్లో రెండో ఏడాది చదువుతున్నాడు.
స్నేహితులతో కలిసి పూల్బాగ్ అద్దెకు ఉంటున్నాడు. స్నేహితుల చరవాణి ఇటీవల పోవడంతో బన్ని తీసి ఉంటాడని మిగిలిన వారు అడగడంతో మనస్తాపానికి గురయ్యాడు. స్నేహితులు బయటకు వెళ్లాక గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్ర ఆసుపత్రికితరలించారు. తండ్రి వెంకటరమణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ సీహెచ్లక్ష్మణరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa