ప్రజలతో మమేకమయ్యే పదవులే తనకు ఇష్టమని, రాజ్యాంగ పదవులు కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్ర పత్రిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'చట్టసభలు చాలా ముఖ్యమైనవి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. చట్టాలు చేయాల్సినవారు గాడితప్పుతున్నారు. దీనిపై చర్చ జరగాలి. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలి' అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa