పెదగార్లపాడు గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు కనకమాల నరేందర్ రెడ్డి ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసాడు అని గురజాల టీడీపీ ఇంచార్జి యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ... ఇలా ఇతను చేయడమనేది ఇది రెండవ సారి. గతంలో కూడా ఇదే వ్యక్తి ఒక ముస్లిం మైనారిటీ బాలికపై అత్యాచారం చెయ్యడం, ఆరోజు కఠినంగా వ్యవహరించలేకపోవడం వల్ల మరలా ఈ సంఘటన పునరావృతం అయ్యింది.
అదేవిధంగా గుత్తికొండలో ముస్లిం మైనార్టీ బాలికపై అత్యాచారం, పిడుగురాళ్లలో ఇదే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు, కాలేజీ ప్రిన్సిపల్ ముస్లిం మైనారిటీ బాలిక పట్ల అత్యాచారం ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపిల్లలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు, నిర్బంధాలు, గతంలో పిడుగురాళ్లలో ఒక బీసీ డాక్టర్ అఘాయిత్యం, అలాగే ఏడుగురు ముక్కుపచ్చలారని పసిపిల్లలు మీరు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోవడం, కనీసం ఆ పిల్లలను కూడా ఆదుకోలేకపోవడం.
ఇవన్నీ చూస్తా ఉంటే ఒక ఆటవిక రాజ్యం, ఒక దుర్మార్గమైన రాజ్యం, ఈరోజు పల్నాడులో, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా రాజ్యమేలతా ఉంది. ఇటువంటి సంఘటనలపై పార్టీలకతీతంగా అధికారులు స్పందించాలి. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి. నిందితునికి కఠినమైన శిక్ష పడేంత వరకూ కూడా వదిలిపెట్టకుండా వెంటనే అరెస్ట్ చెయ్యాలి అని అధికారులను కోరతావున్నాం అని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa