వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. దీంతో అధికార వైసీపీకి సైతం నేతలు దూరమవుతున్నారు. ఇదిలావుంటే కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీకి సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి చూడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
బొంతు రాజేశ్వరరావు రాజోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు పోటీచేశారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికి బొంతు రాజీనామా చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం ఇవ్వడంతో బొంతు వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్గా.. వైఎస్కు సన్నిహితుడిగా పేరుంది. రాజోలు నియోజకవర్గం వైఎస్సార్సీపీలో చాలా రోజులుగా వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యే రాపాక, బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజిల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల కాలంలో రాపాకకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాజేశ్వరరావు అసహనంతో ఉన్నారు.. పార్టీకి రాజీనామా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa