ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశానికి ఆల్‌ ద బెస్ట్...మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు: పుతిన్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 09:36 PM

భారతదేశానికి ఆల్‌ ద బెస్ట్. మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు అంటూ మోడీకి రష్యా దేశాధినేత  పుతిన్ వినూత్నంగా విషేష్ చెప్పారు. దీనికి ఓ కారణముంది. ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిన్న పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. అయితే, మోదీ మర్నాడు (17న) బర్త్ డే జరుపుకుంటున్న విషయం తెలిసి కూడా పుతిన్ విషెస్ చెప్పలేదు. మోదీకి తాను ఎందుకు విషెస్ చెప్పడం లేదో వివరిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని పుతిన్ వెల్లడించారు. 


 ‘‘నేను ఇండియాకు ఆల్‌ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియ మిత్రుడు మోదీ రేపు బర్త్ డే జరుపుకుంటున్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఆయనకు ఇప్పుడు విషెస్ చెప్పను. రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పకూడదు. అందుకనే నేనిప్పుడు ఆయనకు విషెస్ చెప్పడం లేదు’’ అని అన్నారు. ఆ తర్వాత పుతిన్ కొనసాగిస్తూ.. ‘‘ మీ బర్త్ డే విషయం నాకు తెలుసన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. భారతదేశానికి ఆల్‌ ద బెస్ట్. మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం మరింత శ్రేయస్సు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, నేటితో మోదీ 72వ పడిలోకి ప్రవేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa