దేశ రాజకీయాలపై బీహార్ సీఎం నితీశ్కుమార్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడితే 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడవచ్చని, 2024 ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. థర్డ్ ఫ్రంట్ ఊసే లేదని తేల్చి చెప్పేశారు. ఐఎన్ఎల్డీ పార్టీ హర్యానాలోని ఫతేహాబాద్లో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో నితీష్ పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే ఆ పార్టీని గద్దె దింపొచ్చని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa