రేపు అనగా బుధవారం ఉదయం 6.05 గంటలకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు. 7.10 గంటలకు టీటీడీ కోసం వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారు. 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఓర్వకల్ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa