టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసలు పోలీసు అధికారులు సివిల్ కేసులలో ఎందుకు తలదూరుస్తున్నారో అర్థం కావడం లేదని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి డి ఎస్ పి పై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్ పి కి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పిర్యాదు చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు పోలీసులేసహకరిస్తున్నారనిఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జీ పీలా గోవింద సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్యే రాజు, చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బత్తుల తాతయ్య బాబు, యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జీ ప్రగడ నాగేశ్వరరావు, మాడుగుల నియోజకవర్గ ఇంచార్జీ కుమార్, మాజీ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గునూరూ మల్లు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa