రాజాం లో జరిగిన తెలుగుదేశం పార్టీ ఐదు రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతం అయ్యింది. హెల్త్ యూనివర్సిటీకీ ఎన్టీఆర్ పేరు తొలగింపునకు నిరసనగా రాజాం నియోజకవర్గం టిడిపి పార్టీ ఐదు రోజులపాటు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేయగా, అది విజయవంతం అయింది. గత నెల 28వ తేదీన రాజాం అంబేద్కర్ జంక్షన్ లో టిడిపి పార్టీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి ఆదివారం సాయంత్రం ముగించారు.
మొదటి రోజు రాజాం పట్టణం, రెండవ రోజు రేగిడి ఆమదాలవలస మండలం, మూడవ రోజు వంగర, నాలుగో రోజు సంతకవిటి మండలం, ఐదవ రోజు రాజాం రూరల్ మండలం నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ నిరసన ముగింపు కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఐదు రోజులు నిరసన కార్యక్రమం చేశామన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ జరిగే వరకు పోరాడుతామని మురళీమోహన్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa