సోషల్ మీడియా వచ్చాక ఎక్కడపడితే అక్కడ డ్యాన్స్ లు వేస్తూ యువత రెచ్చిపోతోంది. ఇలా చేస్తూ వారు చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. బయట ఎలా ఉన్నా.. దేవాలయానికి వెళ్లేటప్పుడు చాలామంది కొన్ని పద్ధతులను పాటిస్తారు. డా గుడి వెళ్లేటప్పుడు సంప్రదాయబద్ధంగానే వెళ్తారు. కానీ ఓ అమ్మాయి ఆలయ మెట్లపై ఐటెం సాంగ్కు డ్యాన్స్ వేసింది. దానిపై స్వయంగా హోం మంత్రి ఫైర్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఛతర్పూర్ జిల్లాలో ఓ దేవాలయం ఆవరణలో నేహా మిశ్రా అనే యువతి చిరిగిన జీన్స్తో డ్యాన్స్ వేసింది. అక్టోబర్ ఒకటో తేదీన గుడి మెట్లపై దబాంగ్ చిత్రలోని మున్నీ బద్నాం హుయి పాటకు నృత్యం చేసింది. సంబంధిత వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
ఆ వీడియోపై బజరంగ్ దళ్ విరుచుకుపడింది. ఆ సంస్థ ప్రతినిధులు గుడి ఆవరణలో నృత్యం చేయడంపై విమర్శలు గుప్పించారు. దాంతో నేహా మిశ్రా క్షమాపణలు చెప్పింది. మతపరమైన మనో భావాలను దెబ్బతీసినందుకు తనను క్షమించమని కోరుతూ ఆ వీడియోని డిలీట్ చేస్తున్నట్టు చెప్పింది. కానీ ఆమెపై రాష్ట్ర హోంమంత్రి మిశ్రా చాలా సీరియస్ అయ్యారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయని.. వారిపై చర్యలు తీసుకున్నామని.. అయినా నేహా మిశ్రా మళ్లీ అలా ప్రవర్తించడం సరికాదని ఆయన అన్నారు.
"నేహా దుస్తులు ధరించి వీడియో చిత్రీకరించిన విధానం అభ్యంతరకరంగా ఉంద. ఇలాంటి సంఘటనలపై నేను ఇంతకుముందు అభ్యంతరం వ్యక్తం చేశాను. అలాంటి కేసులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని చెప్పాం. అలా హెచ్చరించినా ఆమె ఇలా చేసింది." అని మిశ్రా ఫైర్ అయ్యారు. అందుకే ఆమెపై కేసు నమోదు చేయబోతున్నామని చెప్పారు. నేహాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను మిశ్రా ఆదేశించారు. కాగా నేహా మిశ్రాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్కు నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa