ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్ల రూపకల్పన..దేశంలో తొలిసారి ఉత్పత్తి

national |  Suryaa Desk  | Published : Wed, Oct 05, 2022, 11:01 PM

సాంకేతికతలో పోటీపడుతున్న భారతదేశం లో అద్భత ఆవిష్కరణలు సాగుతున్నాయి. ఇదిలావుంటే చిన్న పరిమాణంలో ఉండి.. చిన్న చిన్న వస్తువులను తీసుకెళ్లే డ్రోన్లనే ఇప్పటి వరకూ చూసి ఉంటారు. కానీ పుణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే ఓ స్టార్టప్ కంపెనీ మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్లను రూపొందించింది. పుణే సంస్థ తయారు చేసిన ఈ డ్రోన్‌లో ఒక వ్యక్తి ప్రయాణించొచ్చు. ఈ ఏడాది జులైలో నిర్వహించిన నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజెనైజేషన్ సెమినార్‌లో ఈ డ్రోన్‌ను ప్రదర్శించారు. వరుణ అని నామకరణం చేసిన ఈ డ్రోన్‌ను త్వరలోనే ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టనున్నారు. తాము తయారు చేసిన డ్రోన్ ద్వారా ద్రవాలు, పరికరాలు, మనుషులను తీసుకెళ్లొచ్చని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రయివేట్ లిమెటెడ్ వెల్లడించింది.


ఈ ప్యాసింజర్ డ్రోన్‌ను రిమోట్ ద్వారా నియంత్రించొచ్చు లేదంటే ముందుగా నిర్ణయించిన రూట్లలో ఇది ఆటోమేటిక్‌గా గాల్లోకి ఎగురుతుంది. 130 కిలోల వరకు బరువును మోయగల ఈ డ్రోన్ అరగంటలోనే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.


సాగర్ డిఫెన్స్ వ్యవస్థపాకుడైన కెప్టెన్ నింకుజ్ పరశార్, సహ వ్యవస్థాపకులైన బబ్బర్, లక్షయ్ డాంగ్‌తో కలిసి ఇండియన్ నేవీ కోసం ఈ డ్రోన్‌కు రూపకల్పన చేశారు. యుద్ధ క్షేత్రాల్లో సైనికులను సురక్షితంగా తరలించడానికి ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. నిఘా కోసం కూడా ఈ డ్రోన్లను ఉపయోగించొచ్చు.


ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో నిధుల సమస్య తలెత్తింది. కానీ ఇండియన్ నేవీ, మజ్‌గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ సహకారంతో నిధులు సమకూరాయి. యాక్సిడెంట్లు జరిగిన సమయంలో క్షతగాత్రులను హాస్పిటళ్లకు తీసుకెళ్లడానికి... మారుమూల ప్రాంతాల వారికి ఎయిర్‌ అంబులెన్స్‌గా.. మెట్రో నగరాల్లో ఎయిర్ ట్యాక్సీగా విపత్తుల సమయంలో వెంటనే తరలించడానికి ఈ డ్రోన్ ఉపయోగపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa