ఎవరెన్ని చెప్పినా వినేది లేదు అంటూ ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ తన తీరుతో స్పష్టంచేస్తున్నారు. అమెరికా, జపాన్లను కవ్వించడంలో ముందుండే ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరోమారు ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేశారు. ఆంక్షలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియా ఈ ఉదయం మరో రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. గత రెండు వారాల్లో ఇది ఆరో పరీక్ష కావడం గమనార్హం. నార్త్ కొరియా క్షిపణులను పరీక్షించిన వెంటనే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది.
కవ్వింపు చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఇదిలావుంటేమంగళవారం కూడా జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించింది. ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా చర్యలకు రష్యా, చైనా నుంచి లభిస్తున్న రక్షణ సహకారమే కారణమని అమెరికా ఈ సమావేశంలో ఆరోపించింది.
మరోవైపు, తమ దేశం మీదుగా క్షిపణిని పరీక్షించడాన్ని తీవ్రంగా పరిగణించిన జపాన్, దక్షిణ కొరియాలు నిన్న యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. వీటిని అమెరికా సమర్థించింది. తమ నౌకాదళ ఆయుధాలను కొరియా ద్వీపకల్పానికి తరలించింది. ఈ సందర్భంగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ స్పందిస్తూ.. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా నిర్ణయాత్మక శక్తితో ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa