పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటైన జే ఏ సి ఆధ్వర్యంలో ఈనెల 15 నిర్వహించనున్న విశాఖ గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె కె రాజు ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని వనరులు సమగ్రంగా ఉన్న విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించడం జరిగిందని దీనిని ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకోవాలని చూస్తున్నాయని దీన్ని తిప్పుకొట్టే విధంగా మనం ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసే విధంగా పనిచేయాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చొక్కాకుల వెంకటరావు గారు, రొంగలి జగన్నాధం గారు, మాజీ వుడా చైర్మన్ రవి రాజు గారు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంపా హనుక్, అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ బర్కత్ అలి, పార్టీ సీనియర్ నాయకులు బేహారా భాస్కరరావు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు&సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa