కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో ఆత్మహత్య సంఘటన విషాదం నింపింది. ముస్తాబాదకు చెందిన పెండెం విజయకుమార్, విజయవాడకు చెందిన సంధ్యారాణిలు, 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు మగపిల్లలు. విజయకుమార్, సంధ్యారాణిలు ఆగిరిపల్లిలో దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో నష్టం రావటంతో ముస్తాబాద వచ్చేశారు. మూడేళ్ల నుంచి సంధ్యారాణి అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇటీవల విజయకుమార్ కూడా మలేరియా, కామెర్ల బారిన పడ్డాడు. ఇద్దరు అనారోగ్యంతో మధన పడుతూ ఉండేవారని బంధువులు తెలిపారు. అనారోగ్యానికి తోడు ఆర్ధిక ఇబ్బందులు కూడా అధికమవడంతో దిక్కుతోచని స్థితిలో ఆదివారం అర్థరాత్రి గ్రామంలోని పేడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై జి.రమేష్ బాబు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa