మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలోని ఓ కొండ ప్రాంతం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొని 14 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. అలాగే మరో 40 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. మృతులంతా దీపావళి పండగకు స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. అయితే బస్సు ముందు వెళ్తున్న ట్రక్క మొదట ఓ గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు ముందుభాగంలో కూర్చున్న వారు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa