చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి పరిహారంగా రావలసిన ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించిన కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ.అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అమర వీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వము నుండి పరిహారంగా రావలసిన ఇళ్ళ స్థలాల గురించి జిల్లా ఎస్.పి. గారు జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. జిల్లా కలక్టర్ గారు, వారి కార్యాలయంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి దస్త్రాలను వెతికించి, బయటికి తీయించారు. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి, గతంలో ఇవ్వబడిన విజ్ఞాపనని పరిశీలించి, అందులో ఏడుగురు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇంటి స్థలాలను కేటాయించడం జరిగింది.దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ను అమరవీరుల కుటుంబ సభ్యులకు ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వర రావు గారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa