చావు ఎపుడు ఎవరిని..ఏ సమయంలో...ఏ స్థితిలో పలకరిస్తుందో చెప్పలేని పరిస్థితి. స్టేజ్లపైనో... వేడుకల్లోనో.. డ్యాన్స్లు వేస్తూ పడిపోయి చనిపోయిన ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్నవారు.. సడన్గా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు. పక్కనే ఉండి తమతో అప్పటి వరకు డ్యాన్స్ వేసిన వాళ్లు.. క్షణాల్లో దూరమవ్వడంతో.. స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
బీహార్లో హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ కథను వినిపిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్సింగ్ స్టేజీపై కుప్పకూలిపోయారు. రాముడి గాథ చెబుతూ.. చెబతూ.. అకస్మాత్తుగా పడిపోయి.. కన్నుమూశారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇది ఛాప్రాలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానని లైవ్గా ప్రసారం చేస్తుండడంతో రిటైర్డ్ ప్రొఫెసర్ మృతి చెందిన విషయం బయటకు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
మారుతీ మానస్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు చివరి రోజు సందర్భంగా శనివారం సాయంత్రం
ఆలయ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్సింగ్.. తులసీదాస్ రామాయణంలోని కొన్ని ఘట్టాలను వినిపించారు. అందులో భాగంగా రాముడి గుణగణాలు వర్ణిస్తున్నారు. అలా చెబుతున్న వ్యక్తి పడిపోయారు. చేతిలో మైక్తోనే వెనక్కి కుప్పకూలిపోయారు. వెంటనే నిర్వహాకులు స్థానిక ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు రావడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.
అప్పటి వరకు తమలో ఒకడిగా ఉంటూ.. ఎంతో ఉత్సాహంగా కథ చెబుతున్నా రణంజయ్సింగ్ చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున జనం వచ్చి... ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. రాముడి కథ చెబుతూనే కన్నుమూయడం ఎంతో పుణ్యమని కొందరు అంటున్నారు. ఇదిలావుంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో నాటకం ప్రదర్శిస్తుండగా శివుడి పాత్రధారి స్టేజ్పైనే కన్నుమూశాడు. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. జౌన్పుర్ జిల్లాలోని బెలాసిన్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శివుడి పాత్రను ధరించిన రామ్ ప్రసాద్ (52) చనిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa