ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆలోచనా విధానం మేం చెప్పడానికి వచ్చాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 12:17 PM

విశాఖలతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నామని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ పేర్కొన్నారు. అమరావతి మహా పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్ర రద్దు పిటిషన్ తో పాటు దాఖలైన అన్ని పిటిషన్లపై  వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి మంత్రి సీనియర్ కౌన్సిల్ తో హైకోర్టుకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని..  న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం? అని ప్రశ్నించారు.  ప్రజల ఆలోచనా విధానం మేం చెప్పడానికి వచ్చాం.. మేం కూడా అవసరం అయితే ఇంప్లీడ్ అవుతామని మా ప్రాంత నాయకులు వచ్చారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa