విశాఖపట్నం నగరంలోని ఆనందపురం మండలం పొడుగుపాలెంలో అంగన్వాడి భవన నిర్మాణం కోసం అధికారులు బలవంతంగా గుడిసెలను తొలగించారు. అయితే గుడిసెల తొలగింపును ఓ వృద్ధురాలు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక వైసీపీ నాయకులు, అధికారులపై వృధ్దురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే జేసీబీ డ్రైవర్పైన పోలీసులు కేసు పెట్టడంపై కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన స్థానిక వైసీపీ సర్పంచ్, అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa